స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమైనాయి.
ముంబై: స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల నేపథ్యంలో గురువారం నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం కొంచెం పుంజుకున్న సెన్సెక్స్ 21 పాయింట్లు ఎగిసి 27,278 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 8422వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా నిఫ్టీ 8400 స్తాయికి ఎగువన ట్రేడ్ అవుతోంది. డాక్టర్ రెడ్డీస్, బీహెచ్ఈఎల్ అరబిందో,టాటా మోటార్స్, అదానీ పో్ర్ట్స్ టాప్ గెయినర్స్ గా , ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఐడియా, గెయిల్, హెచ్యూఎల్, ఐటీసీ బలహీనంగా ఉన్నాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి భారీ నష్టాలతోఉంది.0.27 పైసల నష్టంతో 68.23 వద్ద ఉంది. అలాగేఎంసీఎక్స్ మార్కెట్ లోపుత్తడి పది గ్రా. రూ.42 లాభపడి రూ. 28,780 వద్ద ఉంది.