ఉపాధి కూలీల వేతనం పెంపు


ఏపీ, తెలంగాణల్లో రూ.3 పెరిగిన కూలీ



సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ‘ఉపాధి హామీ’ కూలీలకు చెల్లించే వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంపు రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంది. ఏపీ, తెలంగాణల్లో కూలీలకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రోజుకు గరిష్టంగా రూ.194 వేతనంగా చెల్లిస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.197కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ వేతనాలు అమల్లోకి రానున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top