అమేథీకి బహుమతిగా రెండు రైళ్లు | Rahul gandhi inagurates two trains in amethi | Sakshi
Sakshi News home page

అమేథీకి బహుమతిగా రెండు రైళ్లు

Nov 27 2013 2:39 AM | Updated on Sep 2 2017 1:00 AM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన నియోజకవర్గానికి రెండు రైళ్లు, ఓ రైల్వే లైనును బహుమతులుగా ఇచ్చారు.

అమేథీ (యూపీ): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన నియోజకవర్గానికి రెండు రైళ్లు, ఓ రైల్వే లైనును బహుమతులుగా ఇచ్చారు. అరుుతే ఇలాంటి చర్యలు పేదలను దారిద్య్రం నుంచి గట్టెక్కించజాలవని ఆయన చెప్పారు. అమేథీలోని సలోన్ ప్రాంతంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రెండు రైళ్లను రాహుల్ ప్రారంభించారు. అలాగే ఓ కొత్త రైల్వే లైనుకు శంకుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం రైల్వే లైన్ల ఏర్పాటు, విమానాశ్రయూల నిర్మాణంతో పేదలు దారిద్య్రం నుంచి బయటపడలేరని తానెన్నోసార్లు చెప్పానని అన్నారు.

ఇందుకోసం తాము  తొలుత ఉపాధి హామీ పథకాన్ని.. తాజాగా ఆహార భద్రతా పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఆహార భద్రతా పథకం ఓ విప్లవాత్మకమైన అడుగుగా ఆయన పేర్కొన్నారు. ఎక్కువ సబ్సిడీ రేట్లతో పేదలు ప్రతినెలా ఆహారధాన్యాలు పొందుతారని తెలిపారు. ఈ అడుగు దేశ ముఖచిత్రాన్నే మార్చివేస్తుందని అన్నారు. వేలాది ఏళ్లుగా ప్రజలు ఆకలితోనే నిద్రపోయేవారని.. ఇప్పుడు మాత్రం అలా జరగదని చెప్పారు. గతంలో ‘మేము సగం రొట్టే తింటాం’ అనే నినాదం ఉండేదని, ఇప్పుడది ‘మొత్తం రొట్టె తిందాం’గా మారిందని రాహుల్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement