ప్రభుత్వ అసమర్థతతో అన్యాయం | Ponnam prabhakar about krishna waters | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అసమర్థతతో అన్యాయం

Jan 11 2017 3:32 AM | Updated on Sep 2 2018 5:28 PM

ప్రభుత్వ అసమర్థతతో అన్యాయం - Sakshi

ప్రభుత్వ అసమర్థతతో అన్యాయం

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అస మర్థతతో తెలంగాణకు అన్యాయం జరుగు తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అస మర్థతతో తెలంగాణకు అన్యాయం జరుగు తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడంతో నీటిని ఏపీ, తెలంగాణల మధ్యే పంచుకోవాల్సి వస్తోందన్నారు.

మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవగాహనరాహిత్యంతో తెలం గాణకు తీరని నష్టం కలుగుతోందన్నారు. కృష్ణా నది నీటి పంపకాలకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిష న్ ను కొట్టివేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement