తాను దత్తత తీసుకున్న గ్రామంలో సబ్కలెక్టర్ పల్లె నిద్ర చేపట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకంది.
ధారూర్(రంగారెడ్డి): తాను దత్తత తీసుకున్న గ్రామంలో సబ్కలెక్టర్ పల్లె నిద్ర చేపట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకంది. మండలంలోని గోదాంగూడ గ్రామాన్ని వికారాబాద్ కలెక్టర్ వర్షిణి, గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్నారు. అయితే గ్రామసమస్యలు తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడేందుకు ఆమె ఈ రోజు గ్రామంలో పర్యటించి అక్కడే నిద్రించనున్నారు.