భారీ వరదలతో తొమ్మిది మంది మృతి | Nine killed in Japan after typhoon | Sakshi
Sakshi News home page

భారీ వరదలతో తొమ్మిది మంది మృతి

Aug 31 2016 11:02 AM | Updated on Sep 4 2017 11:44 AM

భారీ వరదలతో తొమ్మిది మంది మృతి

భారీ వరదలతో తొమ్మిది మంది మృతి

బలమైన తుఫాను మూలంగా సంభవించిన వరదలతో తొమ్మిది మంది మృతి చెందారు.

టోక్యో: జపాన్ దేశాన్ని వరుస తుఫాను(టైఫూన్)లు వణికిస్తున్నాయి. ఈ సీజన్లో అక్కడ ఏర్పడిన పదో తుఫాను 'లయన్రాక్' దాటికి కురిసిన భారీ వర్షాలతో ఓ నర్సింగ్ హోం వరదల్లో మునిగిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది వృద్ధులు మృతి చెందారు. సమీపంలోని నది రాత్రికి రాత్రే తీవ్ర రూపం దాల్చడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

జపాన్ ఉత్తర ప్రాంతంలో తీరం దాటిన ఈ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement