వామ్మో... అంత కరెంట్ బిల్లా?

వామ్మో... అంత కరెంట్ బిల్లా?


మొరదాబాద్: పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అంటే ఇదేనేమో. జాతీయ వినియోగదారుల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యంతో ఓ వినియోగదారుడికి పెద్ద షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీల్) అధికారులు పంపిన కరెంట్ బిల్లు చూసి సదరు వినియోగదారుడికి గుండె ఆగినంతపనైంది. రూ.232 కోట్లు కట్టాలని బిల్లు ఇవ్వడంతో అతడు అవాక్కయ్యాడు.



మొరదాబాద్ లో ఓ చిన్న పరిశ్రమ నడుపుతున్న పరాగ్ మిత్తల్ అనే వ్యక్తి ఈ భారీ బిల్లు వచ్చింది. 300,00,92,466 యూనిట్లు వాడినందుకు రూ. 232,07,08,464 కట్టాలని బిల్లులో చూపించారు. పాషిమంచల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఈ బిల్లు వచ్చింది. అయితే మిత్తల్ కంపెనీకి 49 కిలోవాట్ల వరకు మాత్రమే విద్యుత్ వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే రూ.232 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందని పీవీవీఎన్ లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఒకరు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top