కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: స్పెక్ట్రం కోసం టెలికం కంపెనీలు భారీగా వెచ్చించాల్సి రావడం వ ల్ల కాల్ చార్జీలు పెరుగుతాయన్న వాదనలను టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. దీని ప్రకారం ఆపరేటర్లపై వార్షికంగా రూ. 5,300 కోట్లు, నిమిషం పాటు ఉండే కాల్పై 1.3 పైసల మేర మాత్రమే భారం ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేటర్ల వద్ద స్పెక్ట్రం 20 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. వేలం పారదర్శకంగా జరిగిందని మంత్రి చెప్పారు. 19 రోజుల పాటు సాగిన స్పెక్ట్రం వేలంలో రికార్డు స్థాయిలో రూ. 1,09,874.91 కోట్ల బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం పది రోజుల్లోగా ప్రభుత్వానికి రూ. 28,872.7 కోట్ల చెల్లింపులు జరగాల్సివుంటుంది. అయితే, 2014-15 లోటు భర్తీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్చి 31లోగా ఆరు రోజుల్లోనే ఆపరేటర్లు ఈ మొత్తం కట్టేయాలని కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. తక్కువ స్పెక్ట్రం అందుబాటులో ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ వేలానికి ముందు టెలికం శాఖపై విమర్శలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. అయితే, 2100 మెగాహెట్జ్ బ్యాండ్విడ్త్లో 85 మెగాహెట్జ్ను విక్రయానికి ఉంచగా 15 మెగాహెట్జ్ ఇంకా మిగిలిపోయిందని చెప్పారు. దీన్ని బట్టి తాము చేసినది సరైనదేనని తేలిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
వేలంలో ఐడియా సెల్యులార్ అత్యధికంగా రూ. 30,307 కోట్లు వెచ్చించి 900 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్, 2100 మెగాహెట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రం దక్కించుకుంది. ఇవే బ్యాండ్విడ్త్లలో స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ రూ. 29,130 కోట్లకు బిడ్లు వేయగా, వొడాఫోన్ రూ. 29,960 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా ప్రవేశిస్తున్న రిలయన్స్ జియో.. 800, 1800 మెగాహెట్జ్ బ్యాండ్విడ్త్లో స్పెక్ట్రం కోసం రూ.10,077 కోట్ల మేర బిడ్లు వేయగా, ఆర్కామ్ రూ.4,299 కోట్లు వెచ్చిస్తోంది. వేలంలో పాల్గొన్నప్పటికీ టెలినార్ మాత్రం స్పెక్ట్రం దక్కించుకోలేదు. టాటా టెలీసర్వీసెస్ రూ. 7,851 కోట్లు, ఎయిర్సెల్ రూ. 2,250 కోట్ల బిడ్లు వేశాయి.
వేలం ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేత..
స్పెక్ట్రం వేలం ఫలితాలను వెల్లడించడంపై విధించిన స్టేను సుప్రీంకోర్టు గురువారం ఎత్తివేసింది. ఇకపై చేపట్టాల్సిన ప్రక్రియ విషయంలో ముందుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 26న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో.. బిడ్డర్ల నుంచి ముందస్తుగా రూ. 28,000 కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. వేలం నియమ, నిబంధనలను ప్రశ్నిస్తూ టెల్కోలు దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
మొబైల్ టారిఫ్లు పెరగవు..
Published Fri, Mar 27 2015 2:34 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
ప్రముఖ సింగర్పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
T20 World Cup 2024: అదే జరిగితే పాక్ క్వాలిఫయర్స్ ఆడక తప్పదు..!
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement