'ఇరాక్‌లోని భారతీయ బందీలు క్షేమమే' | Government to ensure safe return of Indians from Iraq, says Sushma Sawraj | Sakshi
Sakshi News home page

'ఇరాక్‌లోని భారతీయ బందీలు క్షేమమే'

Aug 5 2014 5:01 PM | Updated on Sep 2 2017 11:25 AM

ఇరాక్‌లోని మోసుల్ నగరంలో మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న 41 మంది భారతీయులను విడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.

న్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్ నగరంలో మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న 41 మంది భారతీయులను విడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. సోమవారం ఆమె రాజ్యసభలో సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మిలిటెంట్లవద్ద బందీగా ఉన్న భారతీయులు క్షేమంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందని చెప్పారు. బిడ్డలకోసం ఎదురుచూసే తల్లిలా తాను వారి విడుదలకోసం వేచిచూస్తున్నానని సుష్మా అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement