బెంగళూరు హైవేపై లారీ బోల్తా; ఐదుగురు మృతి | Five students died in road accident at Bangalore highway | Sakshi
Sakshi News home page

బెంగళూరు హైవేపై లారీ బోల్తా; ఐదుగురు మృతి

Feb 6 2014 10:36 PM | Updated on Oct 8 2018 4:08 PM

నగరంలోని హుబ్లికార్వార హైవేపై గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా, 40మందికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది.

బెంగళూరు: నగరంలోని హుబ్లికార్వార హైవేపై గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా, 40మందికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. లారీ బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

 

ప్రమాదానికి గురైన లారీలో  100మంది విద్యార్థులు మదరసా( ఉర్దూ పాఠశాల)కు చెందిన వారిగా  పోలీసులు గుర్తించారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement