ముంబై: ధరల సెగతో వడ్డీరేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి! ఈ నెల 18న చేపట్టనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా మూడో విడత కీలక పాలసీ రేట్లను పెంచడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. రెపో రేటు(ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు చెల్లించే వడ్డీ)ను మరో పావు శాతం పెంచవచ్చనేది బ్రిటిష్ బ్రోకరేజి దిగ్గజం హెచ్ఎస్బీసీ అభిప్రాయం. ఒక పక్క వృద్ధి మందగమనం ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ వడ్డీరేట్ల పెంపునకే రాజన్ మొగ్గుచూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్నింటికంటే ప్రధానంగా ఎగబాకుతున్న ధరలకు కళ్లెం వేయడంపైనే ఆర్బీఐ పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుందని హెచ్ఎస్బీసీ పేర్కొంది.
రాజన్కు కత్తిమీదసామే...
నవంబర్లో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అనూహ్యంగా 1.07 శాతం ఎగబాకి 11.24 శాతానికి(అక్టోబర్లో 10.17%) దూసుకెళ్లడం తెలిసిందే. ఇది తొమ్మిది నెలల గరిష్టం. మరోపక్క, అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి తిరోగమనంలోకి జారిపోయి మైనస్ 1.8 శాతం క్షీణించింది. ఈ రెండు గణాంకాలూ వెలువడిన మర్నాడే హెచ్ఎస్బీసీ తాజా అంచనాలను ప్రకటించింది. ఒకపక్క పరిశ్రమల రివర్స్గేర్.. మరోపక్క ధరలు చుక్కలనంటుతుండటంతో రాజన్కు ఈసారి పాలసీ సమీక్ష అత్యంత సవాలుగానే నిలవనుంది. సెప్టెంబర్లో ఆర్బీఐ పగ్గాలు చేపట్టిన రాజన్... వరుసగా రెండు సమీక్షల్లో కూడా వడ్డీరేట్లను పావు శాతం చొప్పున పెంచడం తెలిసిందే. ప్రధానంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన ప్రకటించారు కూడా. ఇప్పుడు ద్రవ్యోల్బణం మరింత ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లను మరింత పెంచకతప్పని పరిస్థితి నెలకొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే జరిగితే పారిశ్రామిక రంగం మరింత కుదేలవడం ఖాయమని కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు.
బ్యాంక్ ఆఫ్ అమెరికాదీ అదేమాట...
ద్రవ్యోల్బణం ఆందోళనల ప్రభావంతో 18న మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రేట్ల పెంపు తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) అభిప్రాయపడింది. రెపో రేటు వరుస పెరుగుదల, ఈ విధానంలో నిధులసమీకరణ పరిమితుల నేపథ్యంలో బ్యాంకులు ఇక తమ అదనపు లిక్విడిటీ అవసరాలకోసం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)పై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కూడా పేర్కొంది.
ప్రస్తుతం రెపో రేటు 7.75%, రివర్స్ రెపో 6.75%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4%గా కొనసాగుతున్నాయి. కాగా, ఎంఎస్ఎఫ్ 8.75 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడే తమ ప్రధాన కర్తవ్యమని తాజాగా రాజన్ మరోసారి స్పష్టీకరించిన సంగతి తెలిసిందే. మరోపక్క లిక్విడిటీ మెరుగుదలపై దృష్టిసారిస్తామని కూడా చెప్పారు. తద్వారా మరోవిడత వడ్డీరేట్ల పెంపు, ఎంఎస్ఎఫ్ తగ్గింపు సంకేతాలిచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అయితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు అంతకంతకూ ఎగబాకుతుండటంతో వృద్ధి, ధరల కట్టడి మధ్య సమతూకంతో వ్యవహరించాల్సి ఉంది’ అని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు కూడా నవంబర్లో కాస్త పెరిగి.. 7.1 శాతానికి చేరొచ్చని బీఓఎఫ్ఏ-ఎంఎల్ అంచనా వేసింది. అక్టోబర్లో ఈ రేటు 7%.
మూడో వడ్డింపు తప్పదా?
Published Sat, Dec 14 2013 2:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement