పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం | Decision will take on Interim allowance in ten days, says anam ramanarayana reddy | Sakshi
Sakshi News home page

పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం

Dec 14 2013 8:36 PM | Updated on Sep 2 2017 1:36 AM

పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం

పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం

మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉద్యోగసంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం భేటీలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాద్: పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉద్యోగసంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం భేటీలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఉద్యోగులు 45-50 శాతం వరకూ మధ్యంతర భృతిని కోరినట్టు చెప్పారు.

మధ్యంతర భృతిపై చర్చించేందుకు...  ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళి, ఉత్తమకుమార్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా హజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement