-
మధ్యంతర భృతి ఊసేది!?
సాక్షి, అమరావతి బ్యూరో: పదో పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) గడువు ముగిసి నాలుగు నెలలు దాటింది.. 11వ పీఆర్సీ, ఐఆర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టమైన వైఖరిని ప్రకటించడంలేదు. కొత్త పీఆర్సీ వేస్తారని, తమ జీతాలు పెరుగుతాయని ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రభుత్వం రెండు నెలల క్రితం అశుతోష్ మిశ్రా అధ్యక్షతన కంటితుడుపు చర్యగా కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి ఏడాది కాలపరిమితి విధించి చేతులు దులుపుకుంది. ఈ కమిటీ ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కమిటీ నివేదిక వచ్చేలోగా పెరిగిన ధరలతో ఉద్యోగులు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల ఐక్యతకు చిచ్చు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించి వారి ఐక్యతను దెబ్బతీసింది. ఉపాధ్యాయులలో పండిట్ అప్గ్రెడేషన్తో ఎస్జీటీలకు, పండిట్లకు మధ్య చిచ్చు పెట్టింది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ వివాదంలో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుండటంతో ఐఆర్ను అడిగేవారు లేకుండాపోయారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు.. ఎన్జీఓలు సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టారు. ఇదే అదునుగా తీసుకుని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలాగే దాటేస్తారా? ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం 11వ పీఆర్సీ వెంటనే ఇస్తామంటూ చెప్పి కనీసం ఐఆర్ని కూడా ప్రకటించకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. తదుపరి నిర్ణయాన్ని గవర్నర్కి అప్పగించి చేతులు దులుపుకుంది. ఇక్కడ కూడా జనవరిలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు ఉండటం, ముందస్తుగా సాధారణ ఎన్నికలు జరగనున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు ఇలా మభ్యపెట్టి అలస్యం చేయడంవల్ల ఇప్పటికే రెండు పీఆర్సీలు వెనకబడి ఉన్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రభావం పదవీ విరమణ తర్వాత ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. డిసెంబర్లోనే నిర్ణయం ప్రకటించాలి పండిట్ అప్గ్రెడేషన్, పీఆర్సీ అంశాలను వేర్వేరుగా చూడాలి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు పీఆర్సీలను ప్రకటించే ఎన్నికలకు వెళ్లాయి. జిల్లాల పర్యటనంటూ కమిటీ కాలయాపన చేస్తోంది తప్ప ఉద్యోగుల అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. డిసెంబరులోగా ఐఆర్పై సహేతుక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతాం. – ఎన్. రఘురామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (257) రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం పీఆర్సీ గడువు ముగిసి నాలుగు నెలలు పూర్తయినా కమిటీ ఇప్పటివరకు కేవలం ఆరు జిల్లాల్లోనే పర్యటించింది. ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఐఆర్ను వెంటనే ప్రకటించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు దిగుతాం. ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. – చేబ్రోలు శరత్చంద్ర, బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
మధ్యంతర భృతి వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై ఉద్యోగులకు నిరాశ మిగిలింది. మే 16న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా జూన్ 2న మధ్యంతర భృతి, ఆగస్టు 15న పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. అనంతరం దీన్ని వాయిదా వేసింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక రాకుండా మధ్యంతర భృతి ప్రకటించడం సరికాదనే దీనిపై ప్రకటన చేయలేదు. పీఆర్సీ నివేదిక సిద్ధం కాకపోవడంతో ఆగస్టు 15న ఐఆర్పై ప్రభుత్వ ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. పీఆర్సీ పని ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఐఆర్పై ఆర్థిక శాఖ ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని తెలిసింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించే ప్రక్రి య ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు ఫిట్మెంట్ను ప్రకటిస్తాయి. పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోపు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గత పీఆర్సీ (2013) గడువు ఈ ఏడాది జూన్ ఆఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి పీఆర్సీని ప్రభుత్వం ఈ ఏడాది మేలోనే ఏర్పాటు చేసింది. పీఆర్సీ ప్రస్తుతం నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఎలాంటి మధ్యంతర నివేదికను సమర్పించలేదు. దీంతో ఐఆర్పై ప్రకటన ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఉద్యోగుల జీతాలు, ఫిట్మెంట్ భారీగా పెంచిన కారణంగా ఐఆర్ ఖర్చు అదేస్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఐఆర్ ఒక శాతం ఇస్తే ఏటా రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి వివరించారు. కిరణ్కుమార్రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు పదో పీఆర్సీ సందర్భంగా 27% ఐఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పదో పీఆర్సీ నివేదిక ఆధారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించారు. తెలంగాణలో తొలి పీఆర్సీ కావడంతో ప్రస్తుతం ఐఆర్ ఎంత ఉంటుందనేది ఉద్యోగులలో ఆసక్తికరంగా మారింది. -
35% కాదు.. 37% దాటాల్సిందే
పీఆర్సీ ఫిట్మెంట్పై ఉద్యోగ సంఘాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల 10వ వేతన సవరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు అధికారవర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భత్యం చెల్లిస్తున్నారు. పదో వేతన సవరణ సంఘం సిఫారసు చేసింది 29 శాతం ఫిట్మెంట్ మాత్రమే. మరో ఆరేడు శాతం పెంచి ఫిట్మెంట్ను 35 శాతంగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాలు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం 61 శాతం ఫిట్మెంట్ను ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నా.. కనీసం 37 శాతం దాటితే తప్ప ఫలితం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. 37 శాతం దాటితే రెండు, 42 శాతం దాటితే మూడు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఫిట్మెంట్లో ఒక శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా మూడు వందల కోట్ల మేరకు భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చింది. తొలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అనంతరం కసరత్తు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర వేతన సవరణ తరువాతనే కేంద్ర ఉద్యోగులతో సమాన వేతనాలను ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. -
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
-
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
27శాతం ఐఆర్ చెల్లించేందుకు ఎండీ అంగీకారం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో బుధవారం ఉదయం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు మంగళవారం రాత్రి ప్రకటించాయి. ఈ నెల జీతంతో పాటే మధ్యంతర భృతిని కలిపి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా ఇప్పటివరకు బకాయిపడిన ఐఆర్ను సప్లిమెంటరీ బిల్లు ద్వారా ఏప్రిల్ 15వ తేదీ నాటికి అందజేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె యోచనను విరమించుకున్నాయి. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం కార్మికశాఖ అదనపు కమిషనర్ మురళీసాగర్ ఆర్టీసీ అధికారులను, కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించారు. 2 గంటలపాటు చర్చలు జరిగాయి. ప్రభుత్వం గ్రాంటు అందజేయడంలో జాప్యం కారణంగానే మధ్యంతర భృతిని చెల్లించలేకపోతున్నట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు. దాంతోసమ్మెకు వెళ్లనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న దృష్ట్యా సమ్మె యోచనను విరమింపజేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండీ ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించారు. అనంతరం మరోసారి కార్మిక నాయకులను చర్చలకు పిలిచారు. రాత్రి 10.30 గంటల వరకు చర్చలు జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు కోరిన వెంటనే 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించిన ప్రభుత్వం తమ విషయంలో వివక్ష ప్రదర్శించడం తగదని కార్మిక నాయకులు అన్నారు. దిగొచ్చిన యాజమాన్యం మధ్యంతర భృతిని ఈ నెల జీతంతోనే చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఎండీ పూర్ణచందర్రావు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథ్ధామరెడ్డి, దామోదర్లు సమ్మె యోచనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement