రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది | Central govt should cooperation to AP capital city, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది

Oct 14 2015 11:28 AM | Updated on Aug 20 2018 9:16 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అలాగే పోలవరం నిర్మాణానికి కూడా కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బుధవారం న్యూఢిల్లీలో వెంకయ్య మాట్లాడుతూ... రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో విపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వెంకయ్య ఆరోపించారు. రాజధాని ప్రణాళిక సిద్దం కాకముందే రూ. వెయ్యి కోట్ల నిధులు ఇచ్చామని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement