లాహోర్‌లో బాంబు పేలుడు, 16 మంది మృతి | Blast Outside Punjab Assembly In Pakistan's Lahore | Sakshi
Sakshi News home page

లాహోర్‌లో బాంబు పేలుడు, 16 మంది మృతి

Feb 13 2017 7:39 PM | Updated on Apr 3 2019 3:52 PM

లాహోర్‌లో బాంబు పేలుడు, 16 మంది మృతి - Sakshi

లాహోర్‌లో బాంబు పేలుడు, 16 మంది మృతి

పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది.

లాహోర్: పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయత్రం పంజాబ్‌ ప్రావిన్స్ రాజధాని లాహోర్లో అసెంబ్లీ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారులతో సహా కనీసం 16 మంది మరణించనట్టు సమాచారం. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

నిరసనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో పేలుడు పదర్ధాలు నింపిన వాహాన్ని పేల్చివేసినట్టు పాక్ మీడియా కథనం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులు హస్తం ఉందా? వంటి విషయాలు తెలియాల్సి వుంది. గతేడాది లాహోర్లోనే పబ్లిక్ పార్క్‌లో సంభవించిన బాంబు పేలుడులో దాదాపు 70 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement