'ఆర్టీఐ చట్టం కింద పత్రాల కోసం 1.34 కోట్ల డిమాండ్' | Bihar RTI activist told to cough up Rs.1.34 crore | Sakshi
Sakshi News home page

'ఆర్టీఐ చట్టం కింద పత్రాల కోసం 1.34 కోట్ల డిమాండ్'

Nov 28 2013 3:20 PM | Updated on Sep 2 2017 1:04 AM

సమాచార హక్కు చట్టం ద్వారా ఏ డాక్యుమెంట్ ను పొందాలంటే 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

సమాచార హక్కు చట్టం ద్వారా ఏ డాక్యుమెంట్ ను పొందాలంటే 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే బీహార్ లో మాత్రం ఆర్టీఐ కార్యకర్త శివ్ ప్రకాశ్ రాయ్ కి మాత్రం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిచ్చారు.  ఓ వ్యవసాయ భూమికి సంబంధించిన  రిజిస్ట్రేషన్ పత్రాలను కోరిన ఓ వ్యక్తికి 1.34 కోట్లను చెల్లించాలని అధికారులు తెలిపారు.

వ్యవసాయ భూమిని కమర్షియల్ కేటగిరికి మార్పు చేసిన పత్రాలను ఇవ్వాలని బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా రిజిస్త్రేషన్ అధికారులను కోరారు. అయితే తాము కోరిన మొత్తాన్ని చెల్లిస్తే భూమికి సంబంధించిన పత్రాలను ఇస్తామని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యారు. సాధారణంగా 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని.. కోట్ల రూపాయలను చెల్లించాలని కోరడం సమాచార చట్టం నిబంధనలను ఉల్లంఘించడమే అని శివ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement