'వరి క్వింటాల్కు రూ.300 బోనస్ ఇవ్వాలి' | ap government should help to farmers, says jyothula nehru | Sakshi
Sakshi News home page

'వరి క్వింటాల్కు రూ.300 బోనస్ ఇవ్వాలి'

Nov 6 2015 6:17 PM | Updated on Oct 1 2018 2:09 PM

ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు సర్కార్ రుణమాఫీని అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. వరి క్వింటాల్కు 300 రూపాయలు బోనస్ ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement