వరుస కారు బాంబు పేలుళ్లతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బుధవారం దద్దరిల్లింది.
వరుస కారు బాంబు పేలుళ్లతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బుధవారం దద్దరిల్లింది. బాగ్దాద్ జిల్లా నగరంలో అత్యంత జనసమర్థం ఉండే వివిధ ప్రాంతాలలో కారు బాంబు పేలుళ్ల వల్ల 18 మంది మరణించారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆగంతకులు జరిపిన కాల్పులలో ఇద్దరు పౌరులు మరణించారు. మరో నలుగరు గాయపడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాగ్దాద్ నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అయితే కారు బాంబు పేలుళ్లకు పాల్పడిందని తామే అని ఇప్పటివరకు ఓ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసులు వెల్లడించారు.