రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి | two killed in road accident at navabpet | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి

Jun 15 2017 6:00 PM | Updated on Aug 30 2018 4:10 PM

వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం పులుమామిడి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వికారాబాద్‌: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం పులుమామిడి గేటు సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శివశంకర్‌(55) ఓ శుభకార్యం నిమిత్తం వికారబాద్‌కు వచ్చి తిరిగి కారులో వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్‌తో పాటు శంకర్‌పల్లి మండలానికి చెందిన నవాబ్‌రెడ్డి(45) మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement