రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి | two killed in road accident at navabpet | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి

Jun 15 2017 6:00 PM | Updated on Aug 30 2018 4:10 PM

వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం పులుమామిడి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వికారాబాద్‌: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం పులుమామిడి గేటు సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శివశంకర్‌(55) ఓ శుభకార్యం నిమిత్తం వికారబాద్‌కు వచ్చి తిరిగి కారులో వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్‌తో పాటు శంకర్‌పల్లి మండలానికి చెందిన నవాబ్‌రెడ్డి(45) మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement