నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి | two children drown into pond | Sakshi
Sakshi News home page

నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Jun 21 2015 5:05 PM | Updated on Apr 4 2019 4:44 PM

చిన్నారుల మృతదేహాల వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లులు - Sakshi

చిన్నారుల మృతదేహాల వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లులు

ఖమ్మం జిల్లా కొండంగులబోడు గ్రామంలో నీటి గుంతలోపడి సునీత (9), అంజలి (8) అనే ఇద్దరు బాలికలు మృతిచెందారు.

టేకులపల్లి (ఖమ్మం జిల్లా): టేకులపల్లి మండలం కొండంగులబోడు గ్రామంలో నీటి గుంతలోపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో సునీత (9), అంజలి (8) అనే ఇద్దరు బాలికలు మృతిచెందారు.

పిల్లలిద్దరూ ఆడుకుంటూ..ఆడుకుంటూ పొలంలో ఉన్న నీటిగుంతలో పడిపోయారు. పక్కనే ఎవరూ లేకపోవటంతో కొద్దిసేపటికి ఊపిరివదిలారు. విగతజీవులైన చిన్నారుల్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement