25 నుంచి లాసెట్‌ దరఖాస్తులు | Telangana Lawcet Notification Released | Sakshi
Sakshi News home page

25 నుంచి లాసెట్‌ దరఖాస్తులు

Mar 13 2018 3:00 AM | Updated on Mar 13 2018 3:00 AM

Telangana Lawcet Notification Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : న్యాయ విద్య డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్‌–2018 నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయాలని సెట్‌ కమిటీ నిర్ణయించింది. సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దరఖాస్తులను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణ యించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా ఖరారు చేసింది. పీజీ లాసెట్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీనికి రిజి స్ట్రేషన్‌ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1000గా నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement