రాష్ట్రపతిని కలిసిన గవర్నర్ తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమె మొదటిసారిగా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తమిళిసైకి రాష్ట్రపతి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఆమె కేం ద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని సమాచారం. అనంతరం బుధవారం జరిగే అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఆమె హరియాణాలోని కురుక్షేత్ర వెళ్లనున్నట్లు తెలిసింది.