రాష్ట్రపతిని కలిసిన గవర్నర్‌ తమిళిసై 

Telangana Governor Tamilsai Soundararajan Meets President Ramnath Kovind In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమె మొదటిసారిగా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసైకి రాష్ట్రపతి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఆమె కేం ద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అవుతారని సమాచారం. అనంతరం బుధవారం జరిగే అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఆమె హరియాణాలోని కురుక్షేత్ర వెళ్లనున్నట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top