తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ | Telangana Government Decided To Give Full Salary to Govt Employees | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

Jun 23 2020 7:52 PM | Updated on Jun 23 2020 8:07 PM

Telangana Government Decided To Give Full Salary to Govt Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల (జూన్‌) పూర్తి వేతనం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో గత మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు 50 శాతం వేతనాలు మాత్రమే చెల్లిస్తోంది. అయితే ఈ విషయంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ధర్మాసనం కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
(చదవండి : కీలక భేటీ వాయిదా.. బస్సు ప్రయాణికులకు నిరాశ)

ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రతినిధుల సంబంధించి మాత్రం ఇదివరకు అమలులో ఉన్న 75శాతం కోత విధానాన్ని మరి కొంత కాలం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement