స్కూల్‌ ఆటో దగ్ధం.. విద్యార్థులు క్షేమం

School Auto Burnt Out On the Road In Nirmal - Sakshi

సాక్షి, నిర్మల్‌ : రోడ్డుపై వెళ్తున్న స్కూల్‌ ఆటోలో మంటలు చెలరేగిన ఘటనలో ఆటో డ్రైవర్‌ అప్రమత్తత వల్ల ఆటోలో ఉన్న విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం నిర్మల్‌ జిల్లాలోని అక్కాపూర్‌ వద్ద చోటుచేసుకుంది. 10మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్‌ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరైన సమయానికి ఆటోడ్రైవర్‌ స్పందించి ఆటోలో ఉన్న పిల్లలను కిందకు దించేశాడు. అయితే మంటలు ఆర్పటానికి డ్రైవర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆటో పూర్తిగా కాలిపోయినా అందులోని పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top