మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సెయింట్ నిస్సి చర్చ్ పాదర్ పురుషోత్తం చనిపోయాడు.
ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మల్కాజిగిరి పోలీసులు హుటాహుటిన అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలు పట్టుదలకు పోవడంతో మల్కాజిగిరి ఎమ్మార్వో సంఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా వచ్చి ఇండ్ల మధ్యన ఖననం లాంటివి చేయకూడదని తెలిపారు. చివరికి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.