నల్లగొండలో పంచలోహ విగ్రహాల చోరీ | panchaloha statue robbery in nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండలో పంచలోహ విగ్రహాల చోరీ

Apr 15 2016 1:12 PM | Updated on Aug 30 2018 5:27 PM

నల్లగొండ జిల్లాలోని మేళ్ల చెరువు మండలం మల్లారెడ్డి గూడెంలోని ఉమామహేశ్వర ఆలయంలోని పంచలోహ విగ్రహాలు చోరికి గురయ్యాయి.

నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మేళ్ల చెరువు మండలం మల్లారెడ్డి గూడెంలోని ఉమామహేశ్వర ఆలయంలోని పంచలోహ విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చోరీ చేసిన విగ్రహాలను శుక్రవారం అమ్మకానికి  తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది దుండగులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement