నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుంది
డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్
ఆత్మకూరు(ఎం) (ఆలేరు) : ప్రేమ వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని పల్లెర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నరేష్ తల్లిదండ్రులు వెంటకయ్య–ఇందిరమ్మలను పరామర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు çశ్రీనివాసరెడ్డి చేతిలో హత్యకు గురయినట్లు వెంకటయ్య తెలిపారు.
ఆయన వెంట జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ మండల అ«ధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, కొరటికల్ సర్పంచ్ కొడిమాల యాదగిరిగౌడ్, ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి, సింగిల్విండో చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పాల సంఘం చైర్మన్ జెన్నాయికోడే నాగేష్, మండల ప్రధాన కార్యదర్శి కందడి అనంతరెడ్డి, నాయకులు కట్టెకోల హన్మంతుగౌడ్, పోతగాని మల్లేశంగౌడ్, మహేష్ ఉన్నారు.