దేవరకొండ మండలం నడమడక మజరా షాకెల్లి గ్రామంలో గురువారం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.
కొండమల్లేపల్లి (నల్గొండ జిల్లా) : దేవరకొండ మండలం నడమడక మజరా షాకెల్లి గ్రామంలో గురువారం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. గ్రామానికి చెందిన గుండాల యాదమ్మ అలియాస్ రజిత గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని మృతిచెందింది.
మృతురాలికి భర్త, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. భర్తే హత్య చేసి ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు విలేకరులకు తెలిపారు.