నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం | Leopard spotted in nizamabad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం

May 11 2016 5:52 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామ సమీపంలో చిరుత సంచారం గ్రామస్తులకు ఆందోళన కలిగిస్తోంది.

మాక్లూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామ సమీపంలో చిరుత సంచారం గ్రామస్తులకు ఆందోళన కలిగిస్తోంది. స్థానిక శ్రీఅపురూప ఆలయానికి కొద్ది దూరంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి దాడి చేసి రెండు ఆవు దూడలను చంపేసింది. మంగళవారం వాటి కళేబరాలు కనిపించటంతో బుధవారం ఉదయం రైతులు ఫారెస్టు, పశువైధ్యాదికారులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుతలను బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అటవీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement