సుశీల్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: డీజీపీ | Financial assistance to sushils family | Sakshi
Sakshi News home page

సుశీల్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: డీజీపీ

May 22 2018 1:34 AM | Updated on Mar 19 2019 5:52 PM

 Financial assistance to sushils family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎస్పీతోపాటు జిల్లా పోలీసులు సుశీల్‌ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.2 లక్షలు అందించారు. ఈ చెక్కును సోమవారం రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో సుశీల్‌ భార్య, కుటుంబీకులకు డీజీపీ అందజేశారు.

సుశీల్‌ భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక సాయం అందించిన పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ జితేందర్, పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, సైబరాబాద్, ఖమ్మం అధ్యక్షుడు సీహెచ్‌.భద్రారెడ్డి, శ్రీనివాస్, గ్రేహౌండ్స్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement