అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicides on narwa | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Sep 23 2015 5:36 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

నర్వ (మహబూబ్‌నగర్): అప్పుల బాధతో అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కణ్మనూరు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న కొండన్న(43) తనకున్న మూడున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

గత రెండేళ్లుగా పంట దిగుబడి లేకపోవడంతో పాటు.. ఈ ఏడాది వేసిన కందిపంట ఎండి పోవడంతో.. మనస్తాపం చెంది పొలంలోనె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement