⇒ కేంద్ర హోంశాఖమాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య
⇒ ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కిల్ సమ్మిట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల అమలు తీరుపై నిత్యపర్యవేక్షణ అత్యవసరమని, తద్వారా మాత్రమే ఆశించిన లక్ష్యాలను సాధించగలమని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. స్కిల్ ఇండియా పేరుతో రెండేళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు కొత్తేమీ కాదని.. వేర్వేరు రూపాల్లో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.
‘ద ఇండస్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైన ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అండ్ ఎక్స్పో – 2017’కు పద్మనాభయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రానున్న ఐదేళ్లలో 1.27 కోట్ల ఉద్యోగులకు డిమాండ్ ఉంటుందని.. అయితే ప్రస్తుతమున్న ఉద్యోగుల్లోనే తగిన శిక్షణ పొందిన వారు 4.7 శాతం మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఉద్యోగుల్లోని తగిన శిక్షణ లేని వారితోపాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి బయటకొస్తున్న పట్టభద్రులకూ భిన్న అంశాల్లో నైపుణ్యాలు అందించాల్సి ఉందని అన్నారు. 2022 నాటికి ఒక్క నిర్మాణ రంగంలోనే దాదాపు మూడు కోట్ల మంది నిపుణుల అవసరముంటుందని పద్మనాభయ్య వివరించారు.
పాఠశాల స్థాయి నుంచే..:
ఆంధ్రప్రదేశ్లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వేర్వేరు అంశాలపై నైపుణ్యాన్ని కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో కె.వి.సత్యనారాయణ తెలిపారు. 2022 నాటికల్లా కనీసం రెండు కోట్ల మందికి నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ‘ద ఇండస్ గ్లోబల్’అధ్యక్షుడు ఎస్.బి.అనుమోలు, చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి సి.డి.అర్హ, బియర్డ్సెల్ లిమిటెడ్ ఎండీ భరత్ అనుమోలు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో జరిపిన కృషికి గాను పలువురికి కె.పద్మనాభయ్య అవార్డులు అందజేశారు.
‘స్కిల్ ఇండియా’పై పర్యవేక్షణ అవసరం
Published Thu, Jul 20 2017 4:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement