సగం కన్న తక్కువే..
అమావాస్య..శూన్యతిథే కారణం
ధర్మపురి నుంచి సాక్షి బృందం: పరమ పవిత్రమైన పుష్కర స్నానం..తిథి నక్షత్రం పట్టింపులు చాలా మంది భక్తులకు గురి ఉంటుంది. ఇదిగో..ఇదే సెంటిమెంట్ గురువారం పుష్కర స్నానాలకు వచ్చే భక్తులపై ప్రభావం చూపింది. ఫలితంగా దాదాపు అన్ని పుష్కర క్షేత్రాల్లోనూ గురువారం నాడు పుష్కర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ సంఖ్య మొదటి రెండు రోజుల్లో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్యలో సగం కన్న తక్కువే కావడం గమనార్హం.
పుష్కరస్నానాల్లో తిథుల ప్రాముఖ్యం..
పంచాగం ప్రకారం పుష్కర స్నానాలకు తిథులు కీలకం. గోదావరి పవిత్ర పుష్కర స్నానాలతో పిండ ప్రధానాలకు భక్తులు మంచి రోజులు ఎన్నుకుంటారు. పాడ్యమి నుంచి పున్నమి వరకు పదిహేను తిథులు ఉండగా పుష్కర స్నానాలు, పిండ ప్రధానాలకు, వాయినాలిచ్చుకునేందుకు విదియ, తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి,త్రయోదశి, చతుర్ధశి, పున్నమి రోజులు ప్రాశస్త్యం ఉన్నవిగా వేద పండితులు చెబుతారు. అమావాస్య మాత్రం శూన్యతిథి కావడంతో ఆ రోజు పుష్కర స్నానాలు, పిండప్రదానాలకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపరు. ఈ క్రమంలోనే గురువారం నాడు పుష్కర పుణ్యక్షేత్రాల్లో భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది.
కీలక క్షేత్రాల్లో తగ్గిన పుష్కర భక్తులు..
అమావాస్య సెంటిమెంట్ పలితంగా ధర్మపురి, కాళేశ్వరం, బాసర పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు సంఖ్య చాలా మేర తగ్గింది. గురువారం భక్తులు వచ్చినప్పటికి పుష్కర ఘాట్ల వద్ద జనసందోహాం పలుచబడింది. ధర్మపురిలో సుమారు లక్ష , కాళేశ్వరంలో 50-80 వేలు, బాసరలో 70 వేల, భద్రాచంలో 1.20 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు సమాచారం. గురువారం తరువాత మళ్లీ పుష్కర క్షేత్రాలకు భక్తులు ఎప్పటిలాగే తరలివస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.
అమావాస్య ప్రభావం ఉంది: పాలెపు జయరాం శర్మ, వేదపండితులు, కోరుట్ల.
అమావాస్య..శూన్యతిథి కావడంతో పుష్కర స్నానాలపై భక్తులు పెద్దగా ఆసక్తి చూపరు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ శుభకార్యం చేసేందుకు ముందుకు రారు. అందుకే గురువారం నాడు భక్తుల సంఖ్య తగ్గిపోయింది.
పుష్కర స్నానాలకు తగ్గిన భక్తులు..
Published Fri, Jul 17 2015 12:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement