కారులో నగదు చోరీ | cash theft in parking the car | Sakshi
Sakshi News home page

కారులో నగదు చోరీ

Mar 5 2017 6:11 PM | Updated on Sep 4 2018 4:54 PM

పార్కింగ్‌ చేసిన కారులో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 1.3 లక్షల నగదు, అరతులం బంగారం అపహరించుకుపోయారు.

జవహర్‌నగర్‌: పార్కింగ్‌ చేసిన  కారులో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 1.3 లక్షల నగదు, అరతులం బంగారం అపహరించుకుపోయారు. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాప్రా సాకెత్‌ ఓర్ల లక్ష్మీనర్సింహాగార్డెన్స్‌లో చోటుచేసుకుంది. 
 
క్రైం ఎస్సై నేతాజీ తెలిపిన ప్రకారం నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సుజనాచౌదరి.  ఈ నెల3న కాప్రా సాకెత్‌ సమీపంలోని ఓర్ల లక్ష్మిగార్డెన్స్‌లో ఈవెంట్‌ నిర్వహించడానికి  సాయంత్రం ఏడు గంటల సమయంలో  టీఎస్‌ 07 ఎఫ్‌సి 0650 నెంబర్‌ గల కారును గార్డెన్స్‌ ఆవరణలో పార్క్‌ చేశారు.
 
 ఆ తర్వాత  కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 10 గంటల సయంలో కారు తాళాలు ఆమె దగ్గర నుంచి కనిపించకుండా పోయాయి. దీంతో మరో కారు తాళాలను  మరుసటి రోజు(శనివారం) తీసుకువచ్చి చూసేసరికి కారుతాళాలు తీసి ఉన్నాయి. అప్పటికే ఆ కారులోని పర్సులో ఉన్న డబ్బు, బంగారం గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు.  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement