ప్రభుత్వ సూచనలు బేఖాతరు.. కేసు నమోదు | Case booked on man for not being in home quarantine in Madhapur | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సూచనలు బేఖాతరు.. కేసు నమోదు

Mar 24 2020 6:07 PM | Updated on Mar 24 2020 6:39 PM

Case booked on man for not being in home quarantine in Madhapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆస్ట్రేలియా నుంచి ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చిన యువకుడిపై మాదాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన యువకుడిని ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే అధికారుల సూచనలను బేఖాతరు చేస్తూ యువకుడు బయట తిరిగాడు.

మాదాపుర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీల్లో కారులో సదరు యువకుడు కనిపించాడు. ప్రభుత్వం సూచనలను బేఖాతరు చేసినందుకు సైబరాబాద్ పోలీసులు అతని పై కేసు నమోదు చేసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement