బ్రిడ్జిపై నుంచి కాలువలో పడిపోయిన కానిస్టేబుల్‌.. | Car Fall Under Alugunur Manair Bridge One Died In Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రమాదస్థలిని పరిశీలిస్తుండగా.. మరో ప్రమాదం

Feb 16 2020 11:56 AM | Updated on Feb 16 2020 7:02 PM

Car Fall Under Alugunur Manair Bridge One Died In Karimnagar - Sakshi

అయితే, ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తున్న క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న చంద్రశేఖర్‌ గౌడ్‌ అనే కానిస్టేబుల్‌ అదుపుతప్పి కాలువలో పడిపోయాడు.

సాక్షి, కరీంనగర్‌ : పట్టణంలోని అలుగనూరు-మానేరు బ్రిడ్జిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని శుభాష్‌నగర్‌కు చెందిన గడ్డి శ్రీనివాస్‌, అతని భార్య సునీత, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న కారు ప్రమదవశాత్తూ బ్రిడ్జి పైనుంచి కాలువలో పడిపోయింది. దీంతో కారు నడుపుతున్న శ్రీనివాస్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. సునీత, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

ఆదివారం కావడంతో  కుటుంబంతో కలిసి శ్రీనివాస్‌ కొమురవెళ్లి మల్లన్న దర్శనానికి వెళ్తున్నట్టు తెలిసింది. అయితే, ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తున్న క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న చంద్రశేఖర్‌ గౌడ్‌ అనే కానిస్టేబుల్‌ అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చంద్రశేఖర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన కరీంనగర్‌ వన్‌టౌన్‌లో పనిచేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు అధికారులు, మంత్రి గంగుల కమలాకర్‌ సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement