ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన | BJYM Activists stage dharna for Telangana Emancipation Day | Sakshi
Sakshi News home page

ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన

Aug 28 2015 4:36 PM | Updated on Sep 6 2018 3:01 PM

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. బీజేవైఎమ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

మిర్యాలగూడ (నల్లగొండ) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. బీజేవైఎమ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం బీజేవైఎమ్ కార్యకర్తలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నినాదాలు చేస్తూ.. శుక్రవారం ఆర్డీవో కార్యలయం ఎదుట నిరసనలు చేపట్టారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేయడంలో ఆసక్తి చూసిన కేసీఆర్ ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement