స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరి మృతి | Another two died with Swine flue in Hyderabad | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరి మృతి

Jan 22 2015 6:40 AM | Updated on Sep 2 2017 8:05 PM

రాజధానిలో స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

సాక్షి, హైదరాబాద్: రాజధానిలో స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టోలీచౌకీకి చెందిన అజ్మత్ సుల్తానా(55) బుధవారం ఉదయం మృతిచెందింది. నగర శివార్లలోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది. కాగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుల్లో ఐదుగురు డిశ్చార్జ్ కాగా, మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 35 మంది చికిత్స పొందుతుగా.. మరో 20 మంది రక్త నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. ఉస్మానియా ఆస్పత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో మహిళా హౌస్‌సర్జన్(24) కూడా ఉన్నారు. మరో 11 మంది నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంకు పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement