నకిరేకల్ : రెవెన్యూశాఖలో అవినీతి పెచ్చుమీరుతోంది. మండల అధికారులతోపాటు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ప్రజలనుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లంచాలను తినడం మరిగిన వీఆర్ఓ అలవాటులో భాగంగా ఓ రైతునుంచి పట్టామార్పిడీకోసం రూ.8వేలు డబ్బులు తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎక్కడోకాదు నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయంలోనే పట్టపగలు జరిగింది. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా.. నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామ శివారులోని అడవిబొల్లారం గ్రామానికి చెందిన చిక్కుల్ల లింగయ్య అనే రైతు నకిరేకల్లో నివాసముంటున్నాడు. మూడేళ్ల కిందట తండ్రి సోమయ్య చనిపోగా అతని పేర ఉన్న 7ఎకరాల 7గుంటల భూమిని తల్లి, తన పేరు మీద మార్చాలని ఏడాది కిందట రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ మేరకు విచారణ చేసిన వీఆర్ఓ వెంకటేశ్వర్లు చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాడు. *50వేలు ఇస్తేగాని పట్టా మార్పిడీ జరగదని ఖరాకండీగా చెప్పాడు. దీంతో రైతు అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని తాను కూడా అప్పులలో ఉన్నానని *8వేలు ఇస్తానని రాజీకుదిర్చాడు. తనను ఇంతలా వేదించిన వీఆర్ఓను వదిలేదిలేదని ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వేసిన పథకం ప్రకారం గురువారం ఉదయం తహశీల్దార్ కార్యాలయంలో *8వేల నగదును తీసుకొచ్చాడు. వాటిని వీఆర్ఓ వెంకటేశ్వర్లుకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి *8వేలు, డాక్యూమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి ఏసీబీ కోర్టులో సమర్పిస్తామని డీఎస్పీ బి కోటేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ లింగయ్య విలేకరులకు తెలిపారు. అవినీతి అధికారులను పట్టించాలనుకునేవారు 7382625525 నంబర్కు సంప్రదించాలని కోరారు.
ఇంత అన్యాయమా.. : చిక్కుల లింగయ్య (రైతు)
మా తండ్రి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద నా తల్లి పేరుమీద మార్పిడీ చేసుకునేందుకు ఏడాదికాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. వీఆర్ఓ అన్యాయంగా రూ.50వేలు అడిగాడు. చివరికి తగ్గించుకుంటూ, కాళ్లవేళ్లాపడి *8వేలకు బేరం కుదిరింది. కష్టపడిన సొమ్ము అవినీతి అధికారి చేతిలో పెట్టలేక ఏసీబీకి ఫిర్యాదు చేశాను.
ఏసీబీ వలలో వీఆర్ఓ
Published Thu, Aug 13 2015 10:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement