ఆడుకుంటూ నీళ్ల తొట్టి వద్దకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు.
నీళ్ల తొట్టిలో పడి చిన్నారి మృతి
Jan 27 2016 10:49 AM | Updated on Sep 3 2017 4:25 PM
డోర్నకల్: ఆడుకుంటూ నీళ్ల తొట్టి వద్దకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చిరుకోడు పంచాయతీ జర్పుల తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన జాటోతు లక్ష్మణ్, సత్యవతి కుమారుడు సాయిరాం(3) బుధవారం ఉదయం నీటి తొట్టి వద్ద ఆడుకుంటున్నాడు. అందులో ఉన్న చిన్న బకెట్ను అందుకునే ప్రయత్నంలో నీటి పడిపోయాడు. కుటుంబసభ్యులు గమనించి, బయటకు తీసేసరికే చిన్నాని ప్రాణాలు కోల్పోయాడు.
Advertisement
Advertisement