ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని ఆదుకోండి | 1038 telangana people stranded in iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని ఆదుకోండి

Jun 20 2014 12:41 AM | Updated on Sep 2 2017 9:04 AM

ఇరాక్‌లో జరుగుతున్న అతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 1,038 మంది తెలంగాణ ప్రజలను క్షేమంగా వెనక్కి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విదేశాంగ కార్యదర్శికి రాజీవ్‌శర్మ లేఖ రాశారు.

విదేశాంగ శాఖ కార్యదర్శికి సీఎస్ రాజీవ్‌శర్మ లేఖ


 సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లో జరుగుతున్న అతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 1,038 మంది తెలంగాణ ప్రజలను క్షేమంగా వెనక్కి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విదేశాంగ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారు 850 మంది కాగా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వెళ్లిన తెలంగాణ వారిని కూడా కలుపుకొంటే ఆ సంఖ్య 1,038కి చేరిందని లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని, అందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని రాజీవ్‌శర్మ కోరారు.


 

Advertisement
 
Advertisement
Advertisement