నిజాం కాలేజీలో జియో హైస్పీడ్ వై-ఫై | Nizam College turns into a Digital Campus; JioNet WiFi launched | Sakshi
Sakshi News home page

నిజాం కాలేజీలో జియో హైస్పీడ్ వై-ఫై

Apr 4 2017 6:08 PM | Updated on Sep 5 2017 7:56 AM

నిజాం కాలేజీలో జియో హైస్పీడ్ వై-ఫై

నిజాం కాలేజీలో జియో హైస్పీడ్ వై-ఫై

నగరంలోని అత్యంత పురాతన, ప్రముఖ విద్యాసంస్థ నిజాం కాలేజీ డిజిటల్ క్యాంపస్ గా మారిపోయింది.

హైదరాబాద్ : నగరంలోని అత్యంత పురాతన, ప్రముఖ విద్యాసంస్థ నిజాం కాలేజీ డిజిటల్ క్యాంపస్ గా మారిపోయింది. టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, నిజాం కాలేజీలో జియోనెట్ హై స్పీడ్ వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం నిజాం కాలేజీ ఆడిటోరియంలో ఈ సర్వీసులను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రర్ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
 
నిజాం కాలేజీ లాంటి పాత విద్యాసంస్థ సరికొత్తగా డిజిటల్ సేవలతో ముందుకు దూసుకెళ్లడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ రెడ్డి అన్నారు. ఈ వైఫై సేవలను స్టాఫ్‌, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జియో డిజిటల్ క్యాంపస్ పేరిట,  రిలయన్స్ జియో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో హై-స్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.
 
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 500కు పైగా కాలేజీలో జియోనెట్ వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ఈ సేవలనందిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ ఈవెంట్లో నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహ్మాన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. ఎస్ బాలబ్రహ్మం చారీ, జియో ప్రతినిధులు రమణ సురభి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement