చెత్త సమస్యకు చెక్ | The worst problem, check | Sakshi
Sakshi News home page

చెత్త సమస్యకు చెక్

Jun 24 2014 2:48 AM | Updated on Oct 1 2018 6:38 PM

చెత్త సమస్యకు చెక్ - Sakshi

చెత్త సమస్యకు చెక్

దేశంలోని 500 నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించడానికి బయో మెథానేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు.

  • దేశంలోని 500 నగరాల్లో ‘బయో మెథానేషన్’
  •  వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు
  •  బెంగళూరు కేఆర్ మార్కెట్‌లో ఏర్పాటుకు శంకుస్థాపన
  •  కేంద్ర మంత్రి అనంత కుమార్
  • బెంగళూరు : దేశంలోని 500 నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించడానికి బయో మెథానేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి కేఆర్ మార్కెట్‌లో రూ. 102 కోట్లతో ఆ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    కేఆర్ మార్కెట్ నుంచి రోజూ ఐదు వేల కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నాయన్నారు. నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, బెంగళూరు నగర ఇన్‌చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టే సత్యనారాయణ, బెంగళూరు నగరంలోని ఎంపీలు, శాసన సభ్యులు చర్చించి  కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఇప్పటికే సూచిం చామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement