షోలాపూర్, న్యూస్లైన్: పూర్వీకుల కాలంలోనే ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్న తెలుగు వ్యాపారవేత్త సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. జైలురోడ్డు పోలీసులు అందించిన వివరాల మేరకు.. కర్ణిక్నగర్లో నివాసముంటున్న జగదీశ్ (42) తన ఇంట్లోని గదిలోనే ఆయుధంతో గొంతును కోసుకున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్న ఆయనను చూసి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక మార్కండేయ సహకార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే జగదీశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా జగదీశ్ గత అనేక ఏళ్లుగా సాకార్పేట్లో నూలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వివిధ సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొనేవారు. తక్కువ వయస్సులోనే నూలు వ్యాపారరంగంలో ప్రగతి సాధించారు. అయితే గత కొన్ని నెలలుగా వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదురవడంతో మనోవేదన చెందేవాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇతనికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వ్యాపారి ఆత్మహత్య
Published Mon, Sep 30 2013 11:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement