మినర్వా హోటల్ లో రూ.40కోట్లు మారుస్తూ.. | Police busts gang of converting Rs.40cr's in minerva hotel | Sakshi
Sakshi News home page

మినర్వా హోటల్ లో రూ.40కోట్లు మారుస్తూ..

Dec 15 2016 7:05 PM | Updated on Oct 20 2018 6:19 PM

మినర్వా హోటల్ లో రూ.40కోట్లు మారుస్తూ.. - Sakshi

మినర్వా హోటల్ లో రూ.40కోట్లు మారుస్తూ..

అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమంగా నగదు మార్పిడి జరగుతోంది.

నెల్లూరు: అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమంగా నగదు మార్పిడి జరగుతోంది. తాజాగా రియల్టర్లు, డాక్టర్లకు చెందిన నగదును మార్చుతూ నెల్లూరు పట్టణంలో ఓ ముఠా పోలీసులకు చిక్కింది. పట్టణంలోని మినర్వా హోటల్ లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారబోతోందనే సమాచారంతో పోలీసులు హోటల్ పై దాడి చేశారు.
 
ఈ దాడుల్లో రూ.40కోట్ల నగదును మార్పిడి చేయడానికి యత్నిస్తున్న నలుగురు సభ్యుల బృందాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం నాలుగు బ్యాగుల్లో నగదును తెలంగాణకు చెందిన వ్యక్తుల ముఠా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement