అప్పటిదాకా సేవించిన మద్యం ఇచ్చిన కిక్కు సరిపోదు. ఇంకా తాగాలనిపిస్తుంది. సమయం అర్దరాత్రి దాటింది. వైన్ షాపుల షట్టర్లన్నీ తాళలు వేసుంటాయి. ఎలా? ఒక్క బుక్క తాగితే చాలు, హాయిగా నిద్రపోవచ్చు, కానీ మందు దొరకదు.. ఇప్పుడెలా?.. ఈ తరహా బాధలకు త్వరలోనే కాలం చెల్లిపోనుంది.
అర్దరాత్రా, పట్టపగలా అన్నిది మీ ఇష్టం ఇక ఎంతంటే అంత తాగి.. తందనాలొడొచ్చు. ఎందుకంటే ఇంట్లో దాచుకునే మద్యం బాటిళ్ల సంఖ్యను రెండు నుంచి ఏకంగా 12కు పెంచేసింది ప్రభుత్వం. బాధాకరమైన విషమేమంటే ఈ నిర్ణయం తీసుకున్నది తెలుగు రాష్ట్రాలు కావు. ముంబై రాజధానిగా గల మహారాష్ట్ర!
ఆ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో రెండు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువ నిలువ ఉంటే నేరంగా పరిగణించేవారు. ఆ సంఖ్యను ఇప్పుడు 12కు పెంచుతుండటంతో మందు బాబులు హర్షాతిరేకాలు ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన జీవోను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మంగళవారం ముంబైలో ప్రకటించారు.
మద్యం ప్రియులను సంతోషపెట్టే ఈ నిర్ణయం వెనుక గొప్ప విషాదం దాగుండటం గమనార్హం. మూడు నెలల కిందట మహారాష్ట్రలోని మల్వానీ ప్రాంతంలో కల్తీసారా తాగి 100 మందికిపైగా మృత్యువాత పడిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మందికి సారా తాగే అలవాటు లేనప్పటికీ, అర్ధరాత్రి కావడంతో సాధారణ మద్యం దొరకని కారణంగా వారు సారాయి సేవించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషాదంపై క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన ఫడ్నవిస్ సర్కారు.. మద్యం అందుబాటులో లేకపోవడం వల్లే జనం కల్తీసారాను ఆశ్రయిస్తున్నారని గుర్తించింది. అందుకే ఇంట్లో నిల్వ ఉంచుకునే మద్యం బాటిళ్ల సంఖ్యను 12కు పెంచింది.
అర్ధరాత్రి మద్యం కోరికకు 'మహా' చిట్కా
Published Tue, Sep 1 2015 4:53 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement