♦ కిర్మాణీకి సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం
♦ కోహ్లికి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
♦ ఉత్తమ సీనియర్ మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్
ముంబై: ప్రతిష్టాత్మక బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది.బోర్డులోని అత్యున్నత స్థాయి అధికారులంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి... పాలీ ఉమ్రిగర్ అవార్డు (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్) అవార్డును అందుకున్నాడు. అలాగే క్రికెట్కు ఉత్తమ సేవలందించిన దిగ్గజాలకు ఇచ్చే కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీకి అందించారు.
1983 ప్రపంచకప్లో కపిల్ సేన విజేతగా నిలువడంతో కీలక పాత్ర పోషించిన 66 ఏళ్ల కిర్మాణీ.. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కింద ఓ జ్ఞాపిక, రూ.25 లక్షల చెక్ను అందించారు. ‘ప్రస్తుత కీపర్లలో టెక్నిక్ ఏమాత్రం కనిపించడం లేదు. ఎక్కువగా విజయంపైనే దృష్టి పెడుతున్నారు. అయితే ధోనికి కీపింగ్ చేసే సామర్థ్యం ఉంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా నా ఆట ఉండాలనే ఉద్దేశం అప్పట్లో ఉండేది. దిగ్గజ స్పిన్ త్రయం ప్రసన్న, చంద్రశేఖర్, బేడి బంతులను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. ఈ గౌరవాన్నిచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు’ అని కిర్మాణీ తెలిపారు.
శశాంక్ మనోహర్ చేతుల మీదుగానే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న కోహ్లి.. ఇప్పటిదాకా తన కెరీర్లో ఆసీస్ పర్యటనలో ఆడిన టెస్టు సిరీస్ అత్యంత మధుర జ్ఞాపకంగా నిలిచిందని చెప్పాడు. ‘0-2తో ఆ సిరీస్ కోల్పోయినా మా పోరాటాన్ని గొప్పగా ప్రదర్శించాం. జట్టు ఆటగాళ్లందరూ నన్ను అభినందించారు. ఇప్పటిదాకా ఇదే నా జీవితంలో అత్యంత మధుర క్షణాలుగా భావిస్తున్నాను. మున్ముందు కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను.
పాక్తో ప్రపంచకప్ మ్యాచ్కు ముందు 3 వేల మంది అభిమానులు మా హోటల్ ముందు గుమిగూడారు. ఇలాంటి వారి ముందు మ్యాచ్ ఆడబోతున్నాను. బాగా ఆడాలని నాకు నేను సవాల్ విసురుకుని సాధించాను’ అని కోహ్లి చెప్పాడు. ఉత్తమ సీనియర్ మహిళా క్రికెటర్ అవార్డును అందుకోవాల్సి న మిథాలీ కోల్కతాలో మ్యాచ్ ఆడుతున్నందున కార్యక్రమానికి రాలేదు. ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు.
అవార్డుల వివరాలు
కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం: సయ్యద్ కిర్మాణీ
పాలీ ఉమ్రిగర్ అవార్డు (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్): విరాట్ కోహ్లి
లాలా అమర్నాథ్ అవార్డులు: ఉత్తమ రంజీ ట్రోఫీ ఆల్ రౌండర్: జలజ్ సక్సేనా
దేశవాళీ వన్డేల్లో ఉత్తమ ఆల్రౌండర్: దీపక్ హుడా
మాధవ్రావ్ సింధియా అవార్డులు: రంజీల్లో అత్యధిక పరుగులు: ఉతప్ప (11 మ్యాచ్ల్లో 912)
అత్యధిక వికెట్లు: వినయ్ కుమార్, శార్దుల్ ఠాకూర్ (10 మ్యాచ్ల్లో 48)
ఘనంగా బీసీసీఐ అవార్డుల ప్రదానం
Published Wed, Jan 6 2016 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement