క్వార్టర్స్‌లో తెలంగాణ

Telangana in Quarters of Soft Baseball Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సాఫ్ట్‌బేస్‌బాల్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ బాలికల జట్టు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ 17–8తో పంజాబ్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 13–0తో రాజస్తాన్‌పై, కేరళ 10–0తో హరియాణాపై గెలుపొందాయి.

బాలుర విభాగంలో బిహార్, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, ఒడిశా జట్లు క్వార్టర్స్‌ చేరుకున్నాయి. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో బిహార్‌ 14–1తో హరియాణాపై, ఆంధ్రప్రదేశ్‌ 5–2తో పంజాబ్‌పై, చండీగఢ్‌ 12–0తో గుజరాత్‌పై, ఒడిశా 5–1తో ఛత్తీస్‌గఢ్‌పై గెలుపొందా యి. అంతకుముందు జరిగిన బాలుర లీగ్‌ మ్యాచ్‌ల్లో కేరళ 13–3తో ఉత్తరప్రదేశ్‌పై, మహారాష్ట్ర 18–0తో హిమాచల్‌ ప్రదేశ్‌పై, ఢిల్లీ 10–0తో ఒడిశాపై నెగ్గి ముందంజ వేశాయి.   

, ,

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top