కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు | Sindhu loses in semis, settles for bronze | Sakshi
Sakshi News home page

కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు

Aug 10 2013 1:52 PM | Updated on Sep 1 2017 9:46 PM

కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు

కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింగిల్స్లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది.

గ్వాంగ్‌జూ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింగిల్స్లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది. దాంతో పుసర్ల వెంకట సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం దక్కింది.  తనకన్నా మెరుగైన థాయిలాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌ ఇంతినాన్‌ చేతిలో సింధు 21-10, 21-13 స్కోరుతో పరాజయం పాలైంది.

36 నిమిషాల పేపు జరిగిన ఈ పోరాటంలో మొదటి సెట్‌లో సింధు చేసిన పొరబాట్లతో నాలుగో సీడ్‌ రచనోక్‌ లాభ పడిందింది. రెండో గేమ్‌లో సింధు పుంజుకున్నప్పటికీ, ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రకాష్‌ పడుకొనే తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన క్రీడాకారిణి సింధు కావడం విశేషం. నిరుడు మహిళల డబుల్స్‌లో జ్వాల, అశ్విని కాంస్య పతకాన్ని గెలుపొందారు.


 

Advertisement
 
Advertisement
Advertisement