breaking news
settles for bronze
-
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు
గ్వాంగ్జూ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింగిల్స్లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది. దాంతో పుసర్ల వెంకట సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్య పతకం దక్కింది. తనకన్నా మెరుగైన థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ ఇంతినాన్ చేతిలో సింధు 21-10, 21-13 స్కోరుతో పరాజయం పాలైంది. 36 నిమిషాల పేపు జరిగిన ఈ పోరాటంలో మొదటి సెట్లో సింధు చేసిన పొరబాట్లతో నాలుగో సీడ్ రచనోక్ లాభ పడిందింది. రెండో గేమ్లో సింధు పుంజుకున్నప్పటికీ, ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్లో ప్రకాష్ పడుకొనే తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన క్రీడాకారిణి సింధు కావడం విశేషం. నిరుడు మహిళల డబుల్స్లో జ్వాల, అశ్విని కాంస్య పతకాన్ని గెలుపొందారు. -
సెమీస్ నుంచి నిష్క్రమించిన సింధు
గ్వాంగ్జూ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింగిల్స్లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్ నుంచి ఆమె నిష్క్రమించి కాంస్యంతోనే సరిపెట్టుకుంది. రత్చనోక్ (థాయ్లాండ్)చేతిలో సింధు 21-10, 21-13 తేడాతో ఓటమి పాలైంది. నిన్న జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో ఏడో సీడ్ షిజియాన్ వాంగ్పై 21-18, 21-17 తేడాతో సింధు గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో మహిళల సింగిల్స్లో భారత్కు ఓ పతకం రావటం ఇదే మొదటిసారి.